News February 2, 2025
కాంగ్రెస్లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News February 2, 2025
HYD: నేడు కాంగ్రెస్ నిరసనలు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
News February 2, 2025
గచ్చిబౌలిలో గన్ఫైర్.. కానిస్టేబుల్ను పరామర్శించిన సీపీ మహంతి
గచ్చిబౌలిలో కాల్పుల్లో గాయపడ్డ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వెంకట్ రెడ్డి మాదాపూర్ సీసీఎస్లో పని చేస్తున్నాడని, ఆయన స్వగ్రామం శంకర్పల్లి సింగపూర్ మండలం. ప్రస్తుతం ఆయన కాలికి గాయమైందని, భయపడాల్సిన పని లేదని వైద్యులు తెలిపినట్లు సీపీ వెల్లడించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
News February 2, 2025
HYD: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. మరో 3 రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు ఉండటంతో హడావుడి జోరుగా కొనసాగుతోంది. ఢిల్లీ పీఠం దక్కించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు కుస్తీలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పిలిపించుకొని ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున ప్రచారానికి వెళ్లి ఢిల్లీలో సీఎం ప్రచారం చేయనున్నారు.