News February 2, 2025
కాంగ్రెస్లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News November 6, 2025
NRPT: విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంపొందించాలి: కలెక్టర్

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందించిన కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం నినాదంతో గోడ ప్రతులను నారాయణపేట కలెక్టర్ విడుదల చేశారు. ప్రతి పాఠశాలలో ఈనెల 10 నాటికి క్విజ్ స్పెల్ బీ పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 6, 2025
యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవి నాయక్ తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
News November 6, 2025
NRPT: బాల్య వివాహం సమస్యను అదిగమిద్దాం: కలెక్టర్

దేశ పౌరుల సామాజిక బాధ్యతగా భావించి బాల్య వివాహాలు అనే సామాజిక సమస్యను అధిగమించాలని శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ఎస్ఆర్ గార్డెన్లో పూజారులు, పాస్టర్లు, క్వాజీలు, ప్రింటింగ్ ప్రెస్, ఫంక్షన్ హాల్, డీజే నిర్వాహకులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల రహిత సమాజం కోసం కృషి చేద్దామన్నారు.


