News April 15, 2024
కాంగ్రెస్లో చేరిన ఏపూరి సోమన్న
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తిరిగి కాంగ్రెస్లో చేరారు. తొలుత షర్మిల పార్టీలో చేరిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఈరోజు హైదరాబాద్లో పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
Similar News
News October 12, 2024
NLG: అధ్వానంగా రహదారులు.. ప్రజల ఇబ్బందులు
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఏళ్ల తరబడి రోడ్లు ఇలానే ఉన్నా పట్టించుకునే నాథుడే లేరని, గుంతలుగా మారిన రహదారులపై ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతె మండలంలో మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు. మీ గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
News October 11, 2024
నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంధంవారిగూడెం వద్ద రూ.300 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజను నిర్వహించారు. ఇంగ్లిష్, తెలుగు మీడియలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
News October 11, 2024
NLG: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ఉమ్మడి నల్గొండలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురంలో కొడారి లతమల్లేశ్ ముందస్తు సర్పంచ్ ఎలక్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామస్థులకు ఉచిత మంచినీటిని, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.