News May 3, 2024

కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు: రఘునందన్ రావు

image

అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రైతు రుణమాఫీ, అవ్వ, తాతలకు రూ.4వేల పించన్, మహిళలకు రూ.2500/- ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మోసం చేసే పార్టీలేనని, బీజేపీని గెలిపించాలని కోరారు.

Similar News

News September 12, 2025

RMPT: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. తొనిగండ్ల గ్రామానికి చెందిన మంగలి అనిల్ అనే వ్యక్తి జాన్సీ లింగాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద 15 రోజుల క్రితం షాక్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 12, 2025

శిథిల భవనాలకు ప్రతిపాదనలు అందజేయాలి: కలెక్టర్

image

జిల్లాలో వర్షం కారణంగా ప్రభావితమైన శిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి డీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 108 ఉన్నాయని వీటికి గడువులోగా నివేదికలు తయారు చేయాలన్నారు.

News September 11, 2025

మెదక్: కళాశాలను సందర్శించిన కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర హాస్టల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులపాటు ‌జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతుందని ‌వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు మూడు రోజులపాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.