News February 11, 2026
కాంగ్రెస్ కుట్రలు ప్రజల తీర్పును ప్రభావితం చేయలేవు: హరీశ్ రావు

కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగుల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు సహకరించడం పై మండిపడ్డారు. బీఆర్ఎస్పై విశ్వాసంతో ఓటు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 11, 2026
ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

AP: క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పొడిగించింది. భూముల బదిలీకి సంబంధించి చట్టసవరణకు ముసాయిదా బిల్లు, ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభం సహా మొత్తం 24 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్కు 45.6 ఎకరాలు, సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు, ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.
News February 11, 2026
AIకి ప్రిపేర్ అవ్వకపోతే వెళ్లిపోవచ్చన్న గూగుల్

కంపెనీ AI ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా విరమణ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. వారికోసం ఓ ప్యాకేజీని సైతం తీసుకొచ్చింది. USలో పనిచేసే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(GBO)లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. GBO అనేది గూగుల్ సంస్థ ఉత్పత్తులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ తదితరాలను పర్యవేక్షిస్తుంటుంది. అటు అమెజాన్, మెటా తదితర టెక్ కంపెనీలు ఇలాంటి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.
News February 11, 2026
GNT: మార్చి 1న ‘ఎన్టీఆర్ స్టేడియం’ ఎన్నికలు

బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలను మార్చి 1న నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల చేసి, 13న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సహా మొత్తం 8 మంది సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.


