News May 3, 2024
‘కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితా విడుదల’

కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల జాబితా విడుదల చేసింది. పాలేరు స్వర్ణకుమారి (కాంగ్రెస్) సరళ (సిపిఎం) సురేష్ (CPI), ఖమ్మం జావేద్ (కాంగ్రెస్) శ్రీకాంత్ (CPM) జితేందర్ రెడ్డి (CPI), మధిర శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) వేంకటేశ్వర్లు (CPM) జలందర్ రెడ్డి (CPI), వైరా రోశయ్య (కాంగ్రెస్) వీరభద్రం (CPM) బాబు (CPI), సత్తుపల్లి నరసింహారావు (కాంగ్రెస్) భారతి (CPM), ఆదినారాయణ (CPI)లను నియమించారు.
Similar News
News March 2, 2026
ఖమ్మం: బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మార్చి 4న జీజీహెచ్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 14 వేల మంది బాలికలను గుర్తించి, 7 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. మార్కెట్లో రూ.3,500 విలువ చేసే ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
News March 2, 2026
ఖమ్మం: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం నిధుల విడుదలకు పచ్చజెండా ఊపినట్లు ప్రకటనలు వచ్చినా, క్షేత్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News March 2, 2026
ఖమ్మం: నిర్లక్ష్యం వీడకుంటే ఉద్వాసనే

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత మూడు నెలల్లో 70 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఎనిమిది మందిని సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిని టర్మినేట్ చేశారు.(ECR) అమలు, ఎఫ్ఆర్ఎస్ హాజరుపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని డీఈఓ చైతన్య జైనీ హెచ్చరించారు.


