News July 20, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదు: మంత్రి జూపల్లి

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అవినీతికి ఆస్కారంలేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. విపనగండ్లలో వివిధ అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. BRS పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతికి తావులేదనే సందేశం కిందిస్థాయి వరకు వెళ్లాలని మంత్రి సూచించారు.
Similar News
News November 11, 2025
మహిళలకు స్వయం ఉపాధి ఉచిత శిక్షణ

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో ఉచిత భోజన వసతితో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News November 11, 2025
మూసాపేట: పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై ఉన్న వర్ణమాల, సరళ పదాలను విద్యార్థులతో చదివించి తెలుసుకున్నారు. అక్షయపాత్ర ద్వారా అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
News November 11, 2025
MBNR: ‘ధాన్యం కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉండొద్దు’

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం మూసాపేట మండలం తిమ్మాపూర్, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కల్పించిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ ఆరా తీశారు.


