News January 12, 2026

కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదు: SC

image

కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదని SC స్పష్టం చేసింది. ‘రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిని వారు కోరలేరు. వారి మధ్య వ్యత్యాసాన్ని తీసేస్తే ప్రభుత్వంలో నియామకాల ఉద్దేశం దెబ్బతింటుంది’ అని పేర్కొంది. నంద్యాల(AP) మున్సిపాల్టీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా మానవతా దృష్టితో వీరిని రెగ్యులర్ చేసే అవకాశాలను చూడాలని సూచించింది.

Similar News

News February 20, 2026

హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై వైసీపీ ఆరోపణలేంటి?

image

AP: ‘హెరిటేజ్‌’కు పుణే(MH)లోని ఇందాపూర్ డెయిరీ అనుబంధ సంస్థ అని YCP ఆరోపిస్తోంది. 2015లో అది TTDకి నెయ్యి సరఫరా చేసిందని, నాణ్యత లేకపోవడంతో అనర్హత వేటు వేశారని <<19186015>>జగన్<<>> చెబుతున్నారు. అప్పుడే కల్తీ జరిగితే తమపై ఆరోపణలేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఇందాపూర్’ తమ అనుబంధ సంస్థ కాదని, అక్కడి నుంచి చీజ్ మాత్రమే కొంటామని హెరిటేజ్ స్పష్టం చేసింది. తాము అసలు TTDకి నెయ్యి సరఫరా చేయలేమని పేర్కొంది.

News February 20, 2026

నత్తల నివారణకు విషపు ఎరను ఎలా తయారు చేయాలి?

image

ఈ నత్తలను విషపు ఎరను కూడా వాడి నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి 25 కిలోల తవుడు, 3 కిలోల బెల్లం, థయోడికార్బ్ 100 గ్రాములు, ఆముదం నూనె 100ML కలిపి చిన్న ఉండలుగా చేసి పొలాల్లో అక్కడక్కడా వేయాలి. వీటిని తిన్న నత్తలు మరణిస్తాయి. అంతేకాకుండా 1.5 లీటర్ల నీటిలో పొగాకు కాడెలను (50 గ్రా.) ఉడకబెట్టి చివరగా 60 గ్రా. కాపర్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసి నత్తలను నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News February 20, 2026

ఉదయం పూట ఖర్జూరాలు తింటే..

image

ఉదయం లేవగానే ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులు, పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వాలని, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో నానబెట్టి ఉదయం తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.