News December 23, 2025

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కొత్త ఊపిరి!

image

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్(కేఎంటీ)కు పీఎం మిత్ర పథకం ద్వారా కేంద్రం నిధులు లభించడంతో అభివృద్ధి వేగం పుంజుకుంది. ఇప్పటికే మూడు కంపెనీల ద్వారా రూ.3,862 కోట్ల పెట్టుబడులు, సుమారు 25 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. కొత్తగా మరిన్ని దేశ, విదేశీ సంస్థలు ముందుకు రావడంతో మొత్తం లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Similar News

News December 25, 2025

జగన్‌కు ముద్దు పెట్టిన విజయమ్మ

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.

News December 25, 2025

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను జిల్లాలో విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. ఈ మాంజా మనుషులతో పాటు పక్షులు, పర్యావరణానికి ఎంతో హానికరమని పేర్కొన్నారు. నైలాన్, సింథటిక్ దారాల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, వీటి వినియోగంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విక్రయదారులపై నిఘా ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

News December 25, 2025

వాజ్‌పేయి ఒక యుగ పురుషుడు: చంద్రబాబు

image

AP: దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్‌పేయి అని CM చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో సుపరిపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు ఇది. విగ్రహంతో పాటు ఆయన చరిత్ర ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తాం. ఈ శత జయంతి ఉత్సవాలను ఇక్కడ జరుపుకోవడం సంతోషంగా ఉంది. దేవతల రాజధాని అమరావతికి ఒక నమూనాగా ఈ ప్రజా రాజధాని అమరావతిని నిలబెట్టాలన్నదే నా ధ్యేయం’ అని తెలిపారు.