News October 6, 2025

కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించిన నేపథ్యంలో, పార్కులో అత్యాధునిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పార్క్ నిర్మాణ పురోగతిపై సోమవారం అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News October 6, 2025

స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రెసీ కాలేజ్, ఖమ్మంలోని sr&bgnr కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.

News October 6, 2025

VZM: తొలేళ్ల ఉత్సవంలో భక్తుల ఇక్కట్లు

image

విజయనగరం తొలేళ్ల ఉత్సవానికి భక్తులు భారీ స్థాయిలో హాజరయ్యారు. ఇరుకు స్థలం కావడంతో భక్తులు వచ్చి పోయేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేయడంతోనే ఇబ్బందులు ఎదురయ్యాయని భక్తులు వాపోతున్నారు. గతంలో కేవలం సిరిమాను ఉత్సవం రోజునే బారికేడ్ల ఏర్పాట్లు ఉండేవని ఈ ఏడాది ఒక రోజు ముందుగానే పెట్టారని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News October 6, 2025

మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

image

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.