News August 24, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ భేటీ

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పొదలకూరు రోడ్డులోని YCP జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, భవిష్య కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలు, జిల్లా నాయకత్వం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుమారు అరగంట పాటు మాట్లాడుకున్నారు.

Similar News

News August 24, 2025

నెల్లూరు: 10 కిలోల గంజాయి సీజ్

image

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తిరుపతి వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఆపగా అందులో రూ.80 వేలు విలువచేసే 10 కేజీల గంజాయిను గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాలోని కోరాపూర్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అమ్మేందుకు వెళుతుండగా మార్గం మధ్యలో వారిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News August 24, 2025

DCSలో ఉద్యోగాల సాధించిన అన్నదమ్ములు

image

ఉదయగిరిలోని దిలార్ బావి వీధి వీధికి చెందిన అన్నదమ్ములు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. షేక్ నస్రుల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో 57వ ర్యాంకు సాధించగా, ఆయన సోదరుడు షేక్ సిగ్బతుల్లా పీఈటీ జోనల్-3 జనరల్ విభాగంలో 179 వ ర్యాంకు, బీసీఈలో 1వ ర్యాంకు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నస్రుల్లా ప్రస్తుతం దుత్తలూరు మండలం వెంకటంపేట యూపీ స్కూల్లో SGTగా పనిచేస్తున్నారు.

News August 24, 2025

ఆత్మకూరులో దొంగనోట్ల కలకలం

image

ఆత్మకూరులోని మున్సిపల్ కూరగాయల మార్కెట్లో శనివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. రెండు రూ.200 నోట్లను షాపులలో ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు కొనుగోలు చేసి వెళ్లారు. ఆ షాపు నిర్వాహకులు నోట్లను మరొకరికి ఇచ్చే క్రమంలో దొంగనోట్లుగా తేలింది. దీంతో వారు కంగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరించారు.