News April 1, 2025

కాకాణి పారిపోలేదు: MLC

image

మాజీ మంత్రి కాకాణి కేసుల విషయమై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖ‌ర్‌రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గోవర్ధన్ రెడ్డి పారిపోయారని, అరెస్టు అయ్యారని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉగాది చేసుకోవటానికి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం నెల్లూరుకు వస్తారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలని ప్రభుత్వం చూస్తోంది’ అని అన్నారు.

Similar News

News April 3, 2025

ముస్లింలకు ఉచిత విద్య: అబ్దుల్ అజీజ్

image

నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభవార్త చెప్పారు. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు త్వరలో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పథకం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలకు ఆమోదం తెలిపారు. 

News April 2, 2025

ఏపీకి నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా?: వేమిరెడ్డి

image

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్‌ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదన్నారు. రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

News April 2, 2025

ఐఏబీ నిర్వహించాలని సోమిరెడ్డి లేఖ 

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో రెండో పంట కోసం ఐఏబీ సమావేశం నిర్వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఎండీ ఫరూక్, కలెక్టర్ ఆనంద్‌కు  లేఖ రాశారు. ప్రస్తుతం సోమశిలలో 53.374 టీఎంసీలు, కండలేరులో 48.517 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. రెండో పంటకు నీటి కేటాయింపులకు సంబంధించి ఐఏబీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలన్నారు.

error: Content is protected !!