News August 14, 2024

కాకాని గోవర్ధన్ రెడ్డిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

కోట్లాది రూపాయల విలువైన భూములను కాకాని గోవర్ధన్ రెడ్డి& బ్యాచ్ దోచుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాకాని గోవర్ధన్ & బ్యాచ్ కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.

Similar News

News November 8, 2025

ఉలవపాడు: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

image

ఉలవపాడు మండలంలోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెంకు చెందిన యువకుడు శనివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. SI అంకమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపట్టపుపాలెంకు చెందిన వాయిల చంద్రయ్య, ఆయన కుమారుడు రాజు ఉదయం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు తిరగబడింది. ఆ ఘటనలో రాజు చనిపోయినట్లు తెలిపారు.

News November 8, 2025

NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

image

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 8, 2025

నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

image

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.