News August 4, 2024

కాకినాడలో అరగుండు కొట్టించుకున్న టీడీపీ అభిమాని

image

అరాచక వైసీపీ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ తాను ఎన్నికల ముందు మొక్కుకున్నానని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు మురళి వీరభద్రరావు తెలిపారు. ఆదివారం కాకినాడలోని ఇంద్రపాలెం గ్రామ దేవత ముసలమ్మకు సగం మొక్కును చెల్లిస్తూ సగం గుండు కొట్టించుకున్నారు. మరో సగం సోమవారం తిరుపతి పుణ్యక్షేత్రంలో చెల్లిస్తానన్నారు.

Similar News

News December 16, 2025

విద్యుత్‌.. అమూల్య సంపద: కలెక్టర్‌

image

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్‌లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్‌ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్‌ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

News December 16, 2025

గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

image

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

News December 15, 2025

రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.