News July 17, 2024
కాకినాడలో రామేశంమెట్టను తవ్వేశారు

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశంపేట పరిధిలోని రామేశంమెట్ట వార్తల్లోకెక్కింది. గుట్ట ప్రాంతంలో ఎర్రమట్టి తవ్వకాలు భారీ ఎత్తున జరిగినట్లున్న చిత్రాలు వైరల్గా మారాయి. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభాల చుట్టూ కొంతమేర మట్టి వదిలి.. వాటి చుట్టూ దాదాపు 50 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. తాజాగా అధికారులు ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.
Similar News
News October 31, 2025
రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
News October 31, 2025
నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

నవంబర్ 7న రెడ్క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
News October 30, 2025
నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

నవంబర్ 7న రెడ్క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.


