News March 12, 2025
కాకినాడ: ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెగ్యులర్గా 22,579 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 21,694 మంది హాజరయ్యారు. 885 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్ అధికారి నూకరాజు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో 1,748 మందికి గాను 1,612 మంది హాజరయ్యారని, 136 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని సెంటర్లలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.
Similar News
News September 18, 2025
విశాఖ: ప్రేమ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్ట్

అగనంపూడి యువతిని మోసం చేసిన మర్రిపాలేనికి చెందిన దుల్లా కిషోర్ కుమార్, అతడి స్నేహితులను దువ్వాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు.. కిషోర్ యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు. దీనికి శతీష్, వెంకటేష్ సహకరించారు. మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిని స్టేషన్కు పిలిపించారు. మద్యం తాగి యువతిని బెదిరించడమే గాక అడ్డువచ్చిన పోలీసులపై తిరగబడ్డారు.
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై గళమెత్తనున్నారు. కొడికొండ వద్ద 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. మరోవైపు YCP నాయకులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత ప్రకటించారు.