News December 31, 2025
కాకినాడ ఎంపీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 2025లో కనబరిచిన అత్యుత్తమ పనితీరును పార్లమెంటు బుధవారం వెల్లడించింది. ఆయన మొత్తం 90 శాతం హాజరు నమోదు చేయగా, 17 చర్చల్లో పాల్గొని 58 ప్రశ్నలు సంధించారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలకు 100 శాతం హాజరై తన నిబద్ధతను చాటుకున్నారు. ఎంపీ పనితీరుపై పార్టీ నాయకత్వం హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ చూపుతున్నారు.
Similar News
News February 20, 2026
నెల్లూరు: గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 20, 2026
ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన ‘ఎర్ర బంగారం’

ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్కు గురువారం రైతులు రికార్డు స్థాయిలో 40 వేల బస్తాల పంటను తరలించారు. ఈ సీజన్లో ఇదే అత్యధికం. అయితే, గత వారం క్వింటాకు రూ.18,700 పలికిన ధర, ప్రస్తుతం రూ.18,200కు తగ్గింది. భారీగా బస్తాలు రావడంతో తలెత్తిన ట్రాఫిక్ సమస్యను మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, సిబ్బంది పరిష్కరించారు. పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు తరలిరావడంతో మార్కెట్ ప్రాంగణం సందడిగా మారింది.
News February 20, 2026
KNR: రేషన్ కార్డుదారులారా.. లేట్ చేయకండి..!

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ- కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ- కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో వేలిముద్రలు వేసి ఉచితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. SHARE IT.


