News February 15, 2026
కాకినాడ ఎస్పీ కార్యాలయంలోని రేపు పీజిఆర్ఎస్ రద్దు

రాష్ట్ర ప్రభుత్వం 16వ తేదీన(సోమవారం) సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం కార్యాలయానికి రావొద్దని సూచించారు.
Similar News
News February 19, 2026
బెండలో పేనుబంకను ఎలా నివారించాలి?

బెండ పంటలో పేనుబంక లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలను తీసుకోవాలి. లేకుంటే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. పేనుబంక నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్(3000 PPM) 300ML కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. అయినా ఉద్ధృతి తగ్గకపోతే 100 లీటర్ల నీటిలో థయోమిథాక్సాం 30 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 200mlను కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 19, 2026
హై బీపీ.. ఇలా తగ్గించుకోండి!

అధిక రక్తపోటు వల్ల గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హై BPని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘సోడియం ఎక్కువుండే ఫుడ్ తినొద్దు. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్తో కూడిన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. మద్యం అలవాటు ఉంటే మితంగా తాగండి. ధ్యానం/యోగాతో ఒత్తిడి తగ్గించుకోండి. క్రమం తప్పకుండా BP చెక్ చేసుకోండి. మందులు స్కిప్ చేయొద్దు’ అని చెబుతున్నారు.
News February 19, 2026
గజ్వేల్: ‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’

‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’ అని గజ్వేల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కాయకల్ప పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన టీం లీడర్లు డాక్టర్ విజయ్, డాక్టర్ నీరజ బృందం బుధవారం గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను వారు పరిశీలించి, ఇక్కడి నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు.


