News February 27, 2025
కాకినాడ: ఐదుకు చేరిన జీబీఎస్ కేసులు

కాకినాడ జిల్లాను జీబీఎస్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో నాలుగు కేసులు ఉండగా బుధవారం ఇదే వైరస్తో మరో వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఒకరు డిశ్చార్జి కాగా నలుగురు చికిత్స పొందుతున్నారు. గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నవారు కాకినాడ జీజీహెచ్కు రావాలని సూపరిండెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కోరారు.
Similar News
News February 27, 2025
కరీంనగర్: గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదైన వివరాలు

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 18.88 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 34.98 శాతం నమోదు అయింది.
News February 27, 2025
ఆ పేరు వింటే తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టేది!

బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు. 1906 జులై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ జిల్లాలో జన్మించిన ఈయన.. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. బ్రిటిషర్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. భగత్ సింగ్తో చేయి కలిపి అతని సాయుధ విభాగానికి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. 1931లో 24 ఏళ్లకే వీరమరణం పొందారు.
News February 27, 2025
పిల్లల్ని ఐసిస్లో చేర్చుతారా అంటున్నారు: ప్రియమణి

ముస్తాఫారాజ్ అనే వ్యక్తితో తన వివాహం జరిగినప్పుడు తనపై లవ్జిహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టబోయే పిల్లలని ఐసిస్లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందన్నారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10లో 9నెగటివ్ కామెంట్లే ఉంటాయన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు. కాగా 2017లో ప్రియమణి, ముస్తాఫా మతాంతర వివాహం చేసుకున్నారు.