News March 1, 2025

కాకినాడ : ఒక్క నిమిషం.. వారి కోసం.!

image

కాకినాడ జిల్లాలో 56 కేంద్రాల్లో 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

Similar News

News October 31, 2025

కళ్యాణదుర్గం: బొలెరో బోల్తా.. ఒకరి మృతి

image

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టూరు నుంచి పామిడి వైపు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2025

భారీ వర్షంలో వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు: సీఎండీ

image

మొంథా తుపాను కారణంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పనిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. నీట మునిగిన 249 ట్రాన్స్‌ఫార్మర్లలో 246 ట్రాన్స్‌ఫార్మర్లను ఇప్పటివరకు సరిచేశామని స్పష్టం చేశారు.

News October 31, 2025

ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38L క్యూసెక్కుల వరద

image

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.