News October 4, 2025
కాకినాడ కలెక్టర్కు పెనాల్టీ వేస్తారా..!

కాకినాడలో శనివారం జరిగిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి మంత్రి నారాయణ, ఎంపీ సానా సతీశ్ ఆటో నడుపుతూ వచ్చినప్పుడు డ్రైవర్ సీటు పక్కన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూర్చున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం డ్రైవర్ పక్కన ఎవరూ కూర్చోకూడదు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పుడు నెటిజన్లు “ఇది చట్ట విరుద్ధం, కలెక్టర్కు పెనాల్టీ వేయండి” అంటూ విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఇంకా కలెక్టర్ స్పందించలేదు.
Similar News
News October 4, 2025
తొలిసారి భారత్కు UK PM స్టార్మర్

యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారి భారత్కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఇదే ఆయన తొలి అధికారిక పర్యటన. ఈనెల 9న ఇద్దరు ప్రధానులు ముంబై వేదికగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్కూ వీరిద్దరు హాజరుకానున్నారు.
News October 4, 2025
రాజమండ్రి: 6న స్కూల్ గేమ్స్ సెలక్షన్స్: DEO

ఉమ్మడి తూ.గో జిల్లా స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ను ఈ నెల 6వ తేదీన రాజమండ్రిలోని ఎస్.కె.వి.టి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు తెలిపారు. ఫుట్బాల్ అండర్-14, కరాటే అండర్-14, 17 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని, వివరాలకు పీఈటీలు ఎ.వి.డి. ప్రసాదరావు, వి. భువనేశ్వరిని సంప్రదించాలని డీఈవో కోరారు.
News October 4, 2025
భట్టిప్రోలులో మామను కొట్టిన చంపిన అల్లుడు: SI

అల్లుడు మామను కొట్టి చంపిన ఘటన భట్టిప్రోలులో శనివారం చోటుచేసుకుంది. SI శివయ్య వివరాల మేరకు.. అద్దేపల్లికి చెందిన కారుమూరి రాంబాబును అతని చిన్న అల్లుడు ఏసు తీవ్రంగా కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ వీరాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.