News August 18, 2024
కాకినాడ: కాళ్లు, చేతులు లేకుండా మొండెం
ఏలేశ్వరం మండలం మర్రివీడు సమీపంలోని ఏలేరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. తల, కాళ్లు, చేతులు లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉంది. దీంతో హత్యేననే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వయస్సు 30 నుంచి 35 ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News October 7, 2024
ధవళేశ్వరం బ్యారేజీ UPDATE
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.
News October 7, 2024
సామర్లకోటలో 8న మినీ జాబ్ మేళా
సామర్లకోట టీటీడీసీలో 8న (మంగళవారం) ఉదయం 10.గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, సీడన్ జేడీఎం కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. వివిధ ఉద్యోగుల్లో పని చేసేందుకు పది, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.
News October 7, 2024
తూ.గో: TODAY TOP NEWS
*ఆలమూరు: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
*పిఠాపురం: బ్యాంకు ఎలక్షన్లో కూటమి విజయం
*జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో కోనసీమ కుర్రోడు
*కాకినాడ: అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదా.. ఒకరు మృతి
*రావులపాలెం: కోడిగుడ్ల లారీ బోల్తా
*కాకినాడ: అచ్చంపేట జంక్షన్ వద్ద యాక్సిడెంట్
*కాకినాడ నుంచి ఈ నెల 15న అరుణాచలానికి బస్సు
*రాజమండ్రి: మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
*ధవళేశ్వరం: 8 కాసుల బంగారు ఆభరణాలు చోరీ