News February 3, 2025

కాకినాడ: క్రీడా పోటీలు ప్రారంభం

image

గోదావరి టెన్నిస్ అసోసియేషన్, కాకినాడ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఛాంపియన్ షిప్ సిరీస్ – AITA అండర్ 16 పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పోటీలకు కావలసిన సహాయ సహకారాలు ఆయన అందిస్తానన్నారు.

Similar News

News February 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. APలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది. TGలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా 18 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News February 22, 2026

నట్టింట్లో తల చిక్కు తీయకండి

image

ఇంటి మధ్య భాగాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. అక్కడ తల దువ్వితే వెంట్రుకలు రాలి ఇంట్లోనే పడతాయి. ఇల్లంతా వ్యాపిస్తాయి. తినే ఆహారంలోనూ పడే ఛాన్సుంది. వస్తువులపై పడే అవకాశం కూడా ఉంది. ఇది అశుభ్రతకు దారితీస్తుంది. ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవి నివసించే చోట ఇలా చేయకూడదు. ఇది దారిద్రానికి హేతువని పండితులు చెబుతారు. విడిగా ఒక గదిలో/బాత్రూంలో తల దువ్వుకోవాలి. తద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం.

News February 22, 2026

సూపర్-8: ‘సూర్య’సేన జోరు కొనసాగేనా?

image

T20 WC సూపర్-8లో నేడు 2 కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో ఇంగ్లండ్, శ్రీలంక తలపడతాయి. అనంతరం అహ్మదాబాద్ వేదికగా 7pmకు భారత్, సౌతాఫ్రికా మధ్య పోరు జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచుల్లో గెలిచిన సూర్య సేన.. అదే ఊపుతో సౌతాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ గడ్డపై టీమ్ఇండియా బ్యాటర్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.