News February 7, 2026
కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: జేడీ

జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ సీజన్కు 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించగా, ఇప్పటికే 25,404 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం మరో 4,603 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 16, 2026
కాకినాడ: మూడేళ్ల క్రితం తండ్రి మృతి.. ఇప్పుడు కూతురు సూసైడ్!

కాకినాడ JNTU హాస్టల్లో టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152593>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.
News February 16, 2026
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం నుంచి రూ.564 కోట్లు!

TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బకాయిల విడుదలకు కేంద్రం ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ అధికారులు ఢిల్లీ వెళ్లగా రూ.564 కోట్ల రిలీజ్కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా 60వేల పంపిణీ పూర్తయింది. మరో 30వేలు పంపిణీకి సిద్ధమవ్వగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నిధులు ఇస్తే నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముంది.
News February 16, 2026
లోకల్ హాలిడే ఉన్నా పరీక్ష తప్పనిసరి: డీఈవో

విజయనగరం జిల్లాలోని అన్ని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు డీఈవో మాణిక్యాలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే 10వ తరగతి ప్రీఫైనల్ బయాలజీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని తెలిపారు. లోకల్ హాలిడే ఉన్నా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఇది ఇలా ఉండగా మిగతా క్లాసులకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించాయి. మరి మీ స్కూల్కు సెలవు ఇచ్చారా..


