News February 21, 2025

కాకినాడ జిల్లాలో TODAY TOP NEWS

image

☞జగన్‌ను కలిసిన కన్నబాబు, ☞సామర్లకోట, పిఠాపురం ఆలయాలను సందర్శించిన ఎస్పీ,☞ 48 గంటల్లోనే నిందితులు అరెస్టు,☞పెద్దాపురం: ఎనిమిది మంది వీర్వోలుకు మెమోలు☞ పిఠాపురం: శానిటైజేషన్ సూపర్వైజర్‌పై వ్యక్తి దాడి, ☞తూ.గో జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు,☞పిఠాపురం: 30 ఎకరాల విస్తీర్ణంలో జనసేన ప్లీనరీ సమావేశం, ☞మీడియాకు చురకలు అంటించిన కాకినాడ ఎంపీ, ☞కాకినాడ: ఓటర్లకు ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాఘ‌వులు అభ్యర్థన

Similar News

News November 9, 2025

‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అని యూట్యూబ్‌లో చూసి..

image

AP: దొంగా-పోలీస్ ఆడదామంటూ విశాఖలో అత్త కనకమహాలక్ష్మి(66)ని కోడలు లలిత చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అత్తను చంపే ముందు లలిత యూట్యూబ్‌లో ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడి?’ అనే వీడియోలు చూసింది. తన తల్లి స్నానానికి వెళ్లగా, దాగుడు మూతల పేరిట పిల్లల్ని గదిలోకి పంపింది. అత్తను కట్టేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఎదురింట్లో AC బిగిస్తున్న వ్యక్తి కనకమహాలక్ష్మిని కాపాడేందుకు రాగా లలిత అడ్డుకుంది.

News November 9, 2025

NZB: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తా: కవిత

image

విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు.

News November 9, 2025

జన్నారం: గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

జన్నారం మండలం బాదంపల్లి శివారులోని గోదావరిలో గల్లంతైన యువకుడు గుండా శ్రావణ్ మృతి చెందారు. శనివారం బాదంపల్లి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు ఆయన గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం బాదంపల్లి శివారులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి బయటకు తీశారు. శ్రావణ్ మృతితో ఆయన కుటుంబంతో పాటు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.