News April 14, 2025
కాకినాడ జిల్లా ప్రజలకు హెచ్చరిక

కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పిడుగులు పడే అవకాశాలు నెలకొని ఉన్నాయని సోమవారం జిల్లాలోని కాకినాడ పెదపూడి సామర్లకోట పెద్దాపురం తదితర ప్రాంతాల ప్రజల ఫోన్లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థచే హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ హెచ్చరికలు అనేకసార్లు నిజమయ్యాయి.
Similar News
News September 17, 2025
హత్య కేసులో దంపతులకు పదేళ్ల జైలు

పెద్దాపురం మండలం జి.రాగంపేటలో జరిగిన హత్య కేసులో భార్యాభర్తలకు పదేళ్ల జైలుశిక్ష పడినట్లు సీఐ విజయశంకర్ తెలిపారు. 2022లో ఆదిన ప్రసాద్, అతని భార్య లక్ష్మి పాలాని కలిసి మంగను ఇంటి మెట్లపై నుంచి తోసేశారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు పాపారాణి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ పి. శివశంకర్ కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
News September 17, 2025
వికారాబాద్: చిరుత సంచారంతో భయం భయం

పెద్దెముల్ మండలం తట్టేపల్లి సిద్ధన్నమడుగు తాండ సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. జంతువు పాదముద్రలను చూసిన వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సరస్వతి సిబ్బందితో కలిసి వచ్చి పాదముద్రలను పరిశీలించి అవి చిరుతపులివేనని ధృవీకరించారు. స్థానికులను రాత్రివేళలు లేదా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.