News February 23, 2025

కాకినాడ జిల్లా TODAY TOP NEWS

image

➤తునిలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?
➤పెద్దాపురంలో బంగారం, వెండి చోరీ
➤కాకినాడ: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
➤దుబాయిలో మంత్రితో సానా స‌తీష్
➤కుంభమేళాలో జగ్గంపేట ఎమ్మెల్యే కుటుంబం
➤తునిలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ ప్రజలు
➤గండేపల్లి: గ్రూప్-2 పరీక్షకు 1590 మంది గైర్హాజరు
➤పెదపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
➤కిర్లంపూడి: ముద్రగడను కలిసిన దాడిశెట్టి రాజా

Similar News

News July 7, 2025

నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

image

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 7, 2025

VR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

image

నెల్లూరులోని VR మున్సిపల్ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఎంతో చరిత్ర గల ఈ పాఠశాలను ఇటీవల మంత్రి నారాయణ పున:నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాఠశాల పున:నిర్మాణంలో నారాయణ కూతురు షరిణి కీలక పాత్ర పోషించారు. మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.

News July 7, 2025

NZB: అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి

image

నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.