News November 20, 2025
కాకినాడ జీజీహెచ్లో వృద్ధులకు ‘ఆదివారం’ ప్రత్యేక ఓపీ

రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తెలిపారు. ఈ నెల 23 నుంచి ప్రతి ఆదివారం 65 ఏళ్లు పైబడిన వారికి ఓపీ నంబర్-4లో రిటైర్డ్ ప్రొఫెసర్లు వైద్యం అందిస్తారన్నారు. చికిత్స కోసం వచ్చే వారు ఆధార్ కార్డు తీసుకురావాలని, పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.
Similar News
News November 20, 2025
ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.
News November 20, 2025
ఈటల ఇలాకాలో బండి హిందుత్వ నినాదం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ప్రచారం నిర్వహించగా అక్కడ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో ఈటల రాజేందర్ కులం, మతం పేరు మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. దీనికి కౌంటర్గా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తానని, హిందూ ఎజెండాతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చామని ఈటల ఇలాకా HZBలో బండి రిప్లై ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాలుస్తుందన్న చర్చ నడుస్తోంది.
News November 20, 2025
హిడ్మా అనుచరుడికి 14 రోజుల రిమాండ్: రావులపాలెం CI

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ను రావులపాలెంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు. సరోజ్.. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వచ్చారా? లేక ముందే ఇక్కడ తలదాచుకున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సరోజ్ను కొత్తపేట కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిని RJY జైలుకు తరలించారు.


