News June 21, 2024

కాకినాడ: తనతో మాట్లాడటం లేదని బాలిక సూసైడ్

image

తునికి చెందిన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. SI విజయ్ బాబు వివరాల ప్రకారం.. తునిలోని రెల్లికాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు తనతో మాట్లాడకుండా మరో యువతితో చనువుగా ఉంటున్నాడనే మనస్తాపానికి గురై బుధవారం పురుగుల మందు తాగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

Similar News

News October 4, 2024

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

News October 4, 2024

తూ.గో: 7న కాకినాడలో జాబ్ మేళా

image

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈనెల 7న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కాకినాడలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. 7న ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపారు.

News October 4, 2024

ఏపీ టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా నియమితులైన గంటా స్వరూప్ దేవి శుక్రవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, అభిమానులు మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సంధర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు స్వరూప దేవికి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.