News April 7, 2025
కాకినాడ: నేటి నుంచి వైద్య సేవలకు బ్రేక్

కాకినాడ జిల్లాలో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య (ఆరోగ్యశ్రీ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్య శ్రీ అసోసియేషన్ ఆదివారం వెల్లడించింది. ప్రభుత్వం రూ.3,600 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో అన్ని ఆసుపత్రుల్లో 3,257 వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. దీనిపై ఆసుపత్రి యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంటుందని రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్నామయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2026
HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.
News February 26, 2026
HYD: మూసీ ప్రక్షాళన.. అసలు కథ ఇదే!

మూసీ ప్రక్షాళనలో ‘మార్కింగ్’ వ్యవహారం కలకలం రేపుతోంది. FTL పరిధిలోని 40కి పైగా భారీ కమర్షియల్ నిర్మాణాలను కూల్చకుండా, భారీ జరిమానాలతో రెగ్యులరైజ్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. నది వెడల్పు తగ్గించి, PPP పద్ధతిలో ఖరీదైన భూములను రియల్టర్లకు కట్టబెట్టే మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల ఇళ్లు పోయి, బడా వ్యాపారులకు మేలు జరుగుతుందనే చర్చ జోరందుకుంది.
News February 26, 2026
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ చెల్లింపులు, విద్య, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, హెరిటేజ్, సర్వీస్ సెక్టార్లు సహా మొత్తం 27 రంగాలపై మోదీ-నెతన్యాహు సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ఇండియా-ఇజ్రాయెల్ మధ్య 100 ఎక్స్లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


