News March 18, 2025
కాకినాడ: పరువుగా బతికి.. అప్పులపాలై ఆత్మహత్య

కాకినాడ రూరల్ పండూరుకు చెందిన బావిశెట్టి వెంకటేశ్వరరావు (48) ట్యాంకర్స్ నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలై స్వగ్రామంలో ఉండలేక హైదరాబాద్ వెళ్లిపోయారు. 2నెలల్లో వస్తానని చెప్పి వెళ్లిన ఆయన నెల గడవకముందే నిన్న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. నేడు మృతదేహం స్వగ్రామానికి రానుంది.
Similar News
News September 19, 2025
జహీరాబాద్: ప్రపంచ సుడోకు ఛాంపియన్షిప్కు తండ్రీకొడుకు

ప్రపంచ సుడోకు ఛాంపియన్షిప్ పోటీలకు జహీరాబాద్కు చెందిన తండ్రీకొడుకులు ఎంపికయ్యారు. మలచెల్మ గ్రామానికి చెందిన ఎం. జైపాల్ రెడ్డి, ఆయన కుమారుడు కార్తీక్ రెడ్డి ఈనెల 21 నుంచి హంగేరిలోని ఎగర్లో జరిగే పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. జైపాల్ రెడ్డి 2007 నుంచి జాతీయ, అంతర్జాతీయ సుడోకు పోటీలలో పాల్గొంటూ తన కుమారుడికి కూడా ఈ పోటీలలో పాల్గొనడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు.
News September 19, 2025
‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.
News September 19, 2025
డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.