News December 15, 2025
కాకినాడ: పల్స్ పోలియో విజయవంతానికి సన్నద్ధం

21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై కాకినాడ కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లకు అవగాహన కల్పించారు. విశాఖ ఎస్ఎంఓ డాక్టర్ జాషువా పాల్గొని శిక్షణ ఇచ్చారు. 1,594 బూత్ల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Similar News
News December 16, 2025
సంగారెడ్డి: 3వ విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

3వ విడతలో కల్హేర్, కంగ్టి, మనూర్, నాగలిగిద్ద, NKD, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 16, 2025
VZM: ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్లైన్లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.
News December 16, 2025
ADB: సోషల్ మీడియాపై నిఘా: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాట్సాప్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై పోలీసులు నిఘా ఉంచారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100కు తెలియజేయాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని, ఎన్నికలు పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.


