News November 30, 2024
కాకినాడ: పవన్ ఆగ్రహం.. అధికారులపై యంత్రాంగం చర్యలు

పీడీఎస్ రైస్ అక్రమ తరలింపు అంశంపై కాకినాడ జిల్లా డీఎస్ఓ ఎంవీ ప్రసాద్పై రాష్ట్ర యంత్రాంగం చర్యలు తీసుకుంది. కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు చేయగా అక్రమ రవాణాపై ఆగ్రహించారు. అనంతరం యంత్రాంగం కొంతమంది అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఎంవీ ప్రసాద్ను పౌరసరఫరాలశాఖ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ డీఎస్ఓగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు.
Similar News
News November 9, 2025
తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 8, 2025
రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


