News May 12, 2024

కాకినాడ: పవన్ ఓటేసేది ఎక్కడంటే..?

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం MLA అభ్యర్థిగా పోటీచేస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదుకానందు వల్ల తనకు తానే ఓటు వేసుకోలేని విషయం తెలిసిందే. కాగా ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అక్కడ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News April 22, 2025

కొవ్వూరు: ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

image

కొవ్వూరు మండలంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వాలిశెట్టి రాంబాబు(54) ఉరివేసుకున్నారు. దొమ్మేరుకి చెందిన వరలక్ష్మి ఈనెల 20న 40మాత్రలు మింగిడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో రెండు ఘటనలపై పట్టణ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.

News April 22, 2025

రాజమండ్రి: సప్లమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగింపు

image

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగియనుందని ఆర్ఐవో నరసింహం తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇకపై గడువు పొడిగించబడదన్నారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపునకు నేటితో గడువు ముగియనుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు సాయంత్రం 4గంటలలోగా ఆన్‌లై‌న్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

News April 22, 2025

RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ 

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నరసింహ కిషోర్‌ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్‌ కెమెరాల ఆపరేటింగ్‌‌పై సిబ్బందికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

error: Content is protected !!