News February 28, 2026

కాకినాడ పేలుడు ఘటన.. హోంమంత్రికి సీఎం ఆదేశం

image

AP: కాకినాడ జిల్లాలో జరిగిన పేలుడు ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తక్షణ సాయం చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. మరోవైపు పేలుడు ధాటికి 18 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 28, 2026

భారత్‌పై వరుస సెంచరీలు.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మిచెల్

image

ఈ ఏడాది జనవరి నెలకు గాను న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్‌ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించింది. భారత్‌తో ODI సిరీస్‌లో మిచెల్ 2 సెంచరీలు, ఒక ఫిఫ్టీతో రాణించారు. మొత్తం 352 రన్స్ చేసి NZ 1-2 తేడాతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తారీ నిలిచారు. ఆమె జనవరిలో ఆడిన 6 మ్యాచుల్లో 229 రన్స్ చేశారు.

News February 28, 2026

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

image

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం <<19263875>>ఘటన<<>> నేపథ్యంలో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయనగరం నుంచి కాకినాడకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వేట్లపాలెం చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడనున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఘటనాస్థలానికి బయల్దేరారు.

News February 28, 2026

NIT తిరుచిరాపల్లిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>NIT <<>>తిరుచిరాపల్లి 9 టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, లైబ్రరీ& ఇన్ఫర్మేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, BE/BTech, BLSc, పీజీ అర్హత గలవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 31 వరకు పంపాలి. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nitt.edu/