News March 12, 2025

కాకినాడ: మంత్రి నాదెండ్లను కలిసిన కలెక్టర్ షాన్ మోహన్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గత కొద్దిరోజులుగా కాకినాడలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టు నుంచి రవాణా అవుతున్న బియ్యం తరలిపోకుండా తీసుకుంటున్న చర్యలు కలెక్టర్ మంత్రికి వివరించారు. పీడీఎస్ బియ్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆయనకు సూచించారు.

Similar News

News July 9, 2025

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మహర్దశ

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్‌పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.

News July 9, 2025

ASF: ఉప్పొంగిన ప్రాణహిత

image

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News July 9, 2025

HYD: క‌ల్లు డిపోల లైసెన్స్ ర‌ద్దు చేస్తాం: మంత్రి

image

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు, క‌ల్లు డిపోల లైసెన్స్ ర‌ద్దు చేస్తాం. భ‌విష్య‌త్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా క‌ట్టుదిట్ట‌మైన‌ చ‌ర్య‌లు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.