News June 17, 2024
కాకినాడ: మహిళ దారుణ హత్య
మహిళ దారుణహత్యకు గురైన ఘటన కాకినాడ గ్రామీణ మండలంలో జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపేటకు చెందిన ఓలేటి నరసింహమూర్తికి 8ఏళ్ల క్రితం సీత(26)తో పెళ్లైంది. శనివారం రాత్రి అందరూ నిద్రించాక.. కరెంట్ పోయిందని సీత వేరేగదిలో నిద్రించింది. ఉదయంకల్లా హత్యకు గురైంది. భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. DSP హనుమంతరావు సిబ్బందితో అక్కడికి వెళ్లారు. భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 3, 2024
రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి
అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా..దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.
News October 3, 2024
KKD: ఆ కసాయి తండ్రి దారుణాలెన్నో..?
కాకినాడ జగన్నాథపురం చెక్కావారి వీధిలో పండ్ల వ్యాపారి శివమణి తన బిడ్డను <<14248309>>చంపేసిన<<>> విషయం తెలిసిందే. చెడు వ్యసనాలకు బానిసైన అతను తన మగబిడ్డను వైజాగ్లో అమ్మేశాడు. భర్త చనిపోయి నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్న మహిళతో సహజీవనం చేయగా ఆడబిడ్డ పుట్టింది. ఆబిడ్డను అమ్మేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనకపోవడంతో కోపంతో చిన్నారిని గోడకేసి కొట్టి హతమార్చాడు. నిందితుడిని వన్ టౌన్ సీఐ నాగ దుర్గారావు అరెస్ట్ చేశారు.
News October 3, 2024
వదంతులు నమ్మొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO
చిరుత పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందవద్దని రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ పేర్కొన్నారు. మండపేట తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాదరావు, మండపేట టౌన్ SI హరికోటి శాస్త్రితో కలిసి మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిస్తే 18004255909కి ఫోన్ చేయమని తెలిపారు.