News September 25, 2024
కాకినాడ: ‘వైసీపీలోనే ఉంటా.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఆరోగ్య సమస్యల రీత్యా హైదరాబాద్లో ఉన్నానని, ఇలాంటి సమయంలో లేనిపోనివి ప్రచారం చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నాననే మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే పార్టీ నేతలను కలుస్తానని చెప్పారు.
Similar News
News August 21, 2025
రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
News August 21, 2025
ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ఎత్తివేత

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 12.90 అడుగులకు చేరడంతో జల వనరుల శాఖ అధికారులు బ్యారేజీలోని 175 గేట్లను ఎత్తి, 11.51 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.
News August 21, 2025
తూ.గో: నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్ నిఘా

జిల్లాలో బహిరంగ మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, పాడుబడిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని ఆయన చెప్పారు.