News March 23, 2024
కాకినాడ: హైవేపై బోల్తా కొట్టిన వ్యాన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711208850583-normal-WIFI.webp)
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు నుండి శ్రీకాకుళం జిల్లాకు జామకాయల లోడుతో వెళ్తున్న బొలోరో వ్యాన్ నీలాద్రిరావుపేట వద్దకు వచ్చేసరికి లారీ ఎదురుగా రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జామకాయలు రోడ్డుపై పడిపోయాయి. వ్యాన్లో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News July 5, 2024
తూ.గో.: మద్యం మత్తులో యువతిపై బ్లేడుతో దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720166778029-normal-WIFI.webp)
తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. తంటికొండ వెళ్లే దారిలోని అరవపేటలో ఉంటున్న గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై మతిస్థిమితం లేని యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతి పరుగులు తీస్తుండగా బ్లేడుతో ఆమె చేతిపై, ముఖంపై దాడి చేసాడు. స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి గత కొంత కాలంగా స్మశానంలో జీవిస్తున్నాడు.
News July 5, 2024
రేపు CMల భేటీ.. తెరపైకి ఆ 5 గ్రామ పంచాయతీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720151741615-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు HYDలో శనివారం భేటీ కానున్నారు. ప్రస్తుతం భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలినవి AP పరిధిలో ఉన్నాయి. ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రేపు ఇద్దరు CMల భేటీ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.
News July 5, 2024
మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వ్యక్తి అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720134979104-normal-WIFI.webp)
రాజమండ్రిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తూర్పు మండల డీఎస్పీ కిషోర్ గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.