News March 29, 2025
కాకినాడ: 10వ తరగతి పబ్లిక్ పరీక్ష వాయిదా- DEO

ఈనెల 31న పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష జరగాల్సి ఉంది.అయితే ఆ రోజు రంజాన్ సెలవు కావడంతో ఆ పరీక్షను ఒకటో తేదీకి మార్చినట్లు డీఈవో రమేష్ తెలిపారు. ఈ సమాచారాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్లు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేసి, వారు ఏప్రిల్ 1న పరీక్షకు హాజరయ్యేలా చూడాలని కోరారు.
Similar News
News March 31, 2025
మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తవణంపల్లె మండలం పైమాఘానికి చెందిన రాజేశ్వరి తన భర్తతో కలిసి మొగిలీశ్వర స్వామి గుడికి బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా గొల్లపల్లి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరికి అక్కడికక్కడే చనిపోగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి.
News March 31, 2025
లోన్ తీసుకునేవారికి ALERT!

రుణాలు తీసుకోవాలనుకునేవారికి అలర్ట్. రేపటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వంటివాటిలో మూడింటికి మించి లోన్లు తీసుకోవడం ఇకపై కుదరదు. రుణాల ఎగవేతల్ని కట్టడి చేసేందుకు RBI ఈ నిబంధనను తీసుకొచ్చింది. గత ఏడాది డిసెంబరునాటికి 45 లక్షలమంది 3 కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకోవడం గమనార్హం.
News March 31, 2025
KKRకు షాక్.. 25కే 3 వికెట్లు

ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 25 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. డికాక్ 1, నరైన్ 0, కెప్టెన్ రహానే 11 పరుగులకు ఔటయ్యారు. బౌల్ట్, దీపక్, అశ్వినీ కుమార్ తలో వికెట్ తీశారు.