News February 16, 2026

కాకినాడ: 18న జాబ్ మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, ఫోన్ పే సంస్థల్లో 110 ఖాళీల భర్తీకి ఎంపికలు జరుగుతాయని వెల్లడించారు. టెన్త్ నుంచి డిగ్రీ అర్హత, 18-35 ఏళ్ల వయసున్న వారు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 5, 2026

ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

image

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

News April 5, 2026

హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

News April 5, 2026

సంగారెడ్డి: ఉచిత శిక్షణ.. APPLY

image

స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫ్రిజ్ & ఏసీ రిపేర్ &సర్వీసింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ యువకులు అర్హులని చెప్పారు. దరఖాస్తులలో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో గాని, 94901 03390 నంబర్‌కు వాట్సప్ చేయాలని సూచించారు.