News June 19, 2024
కాకినాడ: 20 నుంచి ITI విద్యార్థులకు ఇంటర్వ్యూలు

కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన ఇటర్వ్యూలు ఉంటాయని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వేణుగోపాల వర్మ మంగళవారం తెలిపారు. కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 554 మందికి ఈ నెల 20 నుంచి 25వ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News December 25, 2025
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


