News February 28, 2026
కాకినాడ: 48 బైక్లు చోరీ.. ఒక్కొ కేసుకు 2 ఏళ్ల శిక్ష: సీఐ

కాకినాడ జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న శోంటిని గంగాధరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏకంగా 48 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరపరచగా ఒక్కో కేసుకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 3, 2026
మార్చి 4న కొత్తవలసలో ఒడిశా గవర్నర్ పర్యటన

ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మార్చి 4వ తేదీన కొత్తవలస మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్, హాస్పిటల్ను ఆయన సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
News March 3, 2026
గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి టీడీపీ హెల్ప్ లైన్

గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారి రక్షణ కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను (95500 57623, 79978 26882) ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ద్వారా బాధితులకు వసతి, ఆహారం, భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి తెలుగు వానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
News March 3, 2026
పార్వతిపురం: ఎస్పీ గ్రీవెన్స్కు 14 అర్జీలు

పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజిఆర్ఎస్ నిర్వహించి 14 అర్జీలను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందజేశారు. ఎస్పీ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలు వాస్తవాలు అయినట్లయితే, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి నివేదికను కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.


