News August 31, 2024
కాకినాడ GGHలో ఎంపాక్స్ ఐసోలేషన్ వార్డ్

కాకినాడ GGH ఆసుపత్రిలోని ENT విభాగంలో 24 పడకలతో ఎంపాక్స్ ఐసోలేషన్ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో వైద్యారోగ్య అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. GGHలోని హెచ్వోడీలతో ప్రత్యేక నోడల్ బృందాన్ని సైతం ఏర్పాటుచేసినట్లు సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి అనుమానిత కేసులేమీ లేవన్నారు.
Similar News
News October 21, 2025
రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.
News October 21, 2025
అమరవీరుల త్యాగాలు మరువలేనివి: తూ.గో. ఎస్పీ

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21న (మంగళవారం) పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శాంతియుత సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారి త్యాగనిరతి అద్భుతమని ఆయన కొనియాడారు.
News October 19, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.