News February 5, 2025

కాగజ్‌నగర్‌లో దేశీదారు స్వాధీనం

image

కాగజ్‌నగర్‌లో బుధవారం దేశీదారు బాటిల్స్ పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. దేశీ దారు స్వాధీనం చేసుకొని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News October 22, 2025

GNT: 40 ఏళ్ల పాటు ఓ పత్రికను నడిపారంటే మాటలా.!

image

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1894 అక్టోబర్ 22న జన్మించారు. న్యాయశాస్త్ర పట్టభద్రులైన ఆయన జాతీయోద్యమం వైపు వెళ్లారు. 1928లో బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయుడిగా, తరువాత ప్రిన్సిపల్‌గా పనిచేశారు. బందరు నుంచి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు 4 దశాబ్దాలు నిర్వహించారు. 1940లో పలు ఉద్యమాలలో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు.

News October 22, 2025

NZB: రియాజ్ మృతి.. డీజీపీకి SHRC ఆదేశాలు

image

రియాజ్ మృతిపై తెలంగాణ మానవ హక్కుల కమినషన్(SHRC) స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. నవంబర్ 24వ తేదీలోగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కేసు ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు అందజేయాలంది. కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు డీజీపీ ప్రకటించారు.

News October 22, 2025

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. సీఎం సంతకం

image

TG: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రూల్‌ను తొలగించే పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. గురువారం మంత్రివర్గ ఆమోదం తర్వాత ఈ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. దాని ప్రకారం వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.