News January 24, 2026
కాగజ్నగర్లో విషాదం.. భవానీ మృతి

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 10, 2026
1000 మందితో ఎన్నికల బందోబస్తు: ADB SP

ఎన్నికల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్ఐలతో, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వు సిబ్బంది, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 10 వార్డులకు ఒక ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉంటారని వివరించారు.
News February 10, 2026
కరీంనగర్: పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది పయనం

కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ సామాగ్రితో ఆయా కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని తీసుకున్న సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య తరలివెళ్లారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
News February 10, 2026
భారత బ్యాటర్లపై సంచలన ఆరోపణలు

భారత క్రికెటర్లపై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. ఇతర జట్లు వాడే బ్యాట్ల కంటే IND క్రికెటర్ల బ్యాట్లు ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయన్నారు. ‘మాకు దొరికే బెస్ట్ బ్యాట్స్ కంటే IND ప్లేయర్ల బ్యాట్లు చాలా మెరుగైనవి. వాటిపై ఒక రబ్బర్ లేయర్ ఉంటుంది. ఇదెలా సాధ్యమో నాకు తెలియదు. వేరే వారికి ఈ బ్యాట్లు దొరకవు. ఆటగాళ్లందరికీ ఈ విషయం తెలుసు’ అని వ్యాఖ్యానించారు.


