News October 8, 2025
కాగజ్నగర్ డివిజన్లో చిరుతపులి సంచారం

కాగజ్నగర్ డివిజన్లోని సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధి వేంపల్లి, ఇస్గాం అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల పలు పశువులపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవులకు వెళ్లే ప్రజలు ఒంటరిగా వెళ్లకూడదని, తప్పనిసరిగా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. సీసీ కెమెరాలతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు.
Similar News
News October 8, 2025
టాటా గ్రూప్ వివాదాలకు త్వరలో తెర!

టాటా గ్రూపులో తలెత్తిన వివాదాలకు త్వరలోనే తెరపడనుందని సమాచారం. గ్రూపులోని టాటా, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాజీకి వస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. టాటా సన్స్లోనూ డైరెక్టర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వీటన్నింటిపై అమిత్ షా, నిర్మల సమక్షంలో చర్చలు జరిగాయి. తీవ్ర ప్రభావం చూపించేలా మారిన విభేదాల్ని వీడాలని వారు స్పష్టంచేశారు. రతన్ టాటా మృతి తర్వాత గ్రూపులో విభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు.
News October 8, 2025
వేములవాడ: 24 గంటల్లో.. 20 ఆపరేషన్లు..!

వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రిలో 24 గంటల్లో 20 రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పెంచలయ్య తెలిపారు. ఇందులో సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటిఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆపరేషన్ ఒకటున్నాయి. ఆపరేషన్లు చేసిన వారిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సంధ్య, సోనీ, మాధవి, పిల్లల వైద్యులు సుభాషిణి, చారి, రమణ, ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్, అనిస్థీషియన్లు రాజశ్రీ, తిరుపతి ఉన్నారు.
News October 8, 2025
జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు: TDP

నకిలీ మద్యం విషయంలో TDP నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడని TDP ట్వీట్ చేసింది. ‘YCP హయాంలో అతని నకిలీ మద్యం దందా బాగా నడిచింది. తిరిగి 15 రోజుల క్రితమే YCP పెద్దల ఆదేశాలతో మళ్ళీ మొదలుపెట్టాడు. ఎక్సైజ్ శాఖ అప్రమత్తతో ఈ నెట్ వర్క్ని బయట పెట్టి అరెస్ట్లు చేసింది. దీని వెనుక ఉన్న YCP పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.’అని పేర్కొంది.