News December 12, 2025

కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌ ప్రారంభించిన లోకేశ్

image

కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్‌కు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కాసేపటి క్రితం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. మధురవాడ హిల్ నెం2లోని మహతి ఫిన్ టెక్ భవనంలో వెయ్యి మంది సీటింగ్ కెపాసిటీతో ఈ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. కంపెనీ శాశ్వత భవనం మొదటి దశ పూర్తయ్యే వరకు ఇక్కడే కార్యకలాపాలు కొనసాగించనున్నారు.

Similar News

News December 12, 2025

మద్యం దుకాణాలను మూసివేయాలి: ఆదర్శ్ సురభి

image

వనపర్తి జిల్లాలో ఈనెల 14న 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో శుక్రవారం 5PM తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాలలో నిషేధాజ్ఞలు 5గంటల నుంచి అమలులోకి వస్తాయన్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News December 12, 2025

కొండాపూర్: యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్

image

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ కార్యక్రమం కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో శుక్రవారం నిర్వహించారు. చెరువులో విద్య ట్యాంకర్ల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామస్థులతో పాటు చుట్టు పక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

News December 12, 2025

ప్రచారానికి తెర.. కరీంనగర్ పల్లెలు సైలెంట్.!

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల సందడికి తెరపడింది. పాటలు, కరపత్రాలతో ఓటర్లను ఆకర్షించిన అభ్యర్థులు మౌనం వహించారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికారులు ఓటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.