News April 3, 2025

కాజీపేట: టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన జూదరులు

image

కాజీపేటలోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.27,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.

Similar News

News December 15, 2025

జగిత్యాల: దంపతులు ఇద్దరికీ సమాన ఓట్లు

image

పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో పోచమ్మల ప్రవీణ్ (8వ వార్డు), మంజుల (10వ వార్డు) దంపతులు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98, 98 ఓట్లు సమానంగా పోల్ అయ్యాయి. కాగా, ప్రవీణ్ రామన్నపేట ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని BRS బలపరిచింది.

News December 15, 2025

జగిత్యాల: 3వ విడత ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

జగిత్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కోసం సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 1306 మంది POలు, 1706 మంది APOలను కేటాయించారు. సిబ్బంది నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, అబ్జర్వర్ రమేష్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.

News December 15, 2025

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్ భేటీ

image

AP: విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. స్కిల్ అసెస్మెంటులో AI టెక్నాలజీ ఆధారిత పోర్టల్, పైలెట్ ప్రాజెక్టు అమలు గురించి వివరించారు. రాష్ట్ర నైపుణ్య గణనకు సహకరించాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో InnoXR యానిమేషన్, ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. మరో కేంద్ర మంత్రి జయంత్ చౌదరితోనూ లోకేశ్ సమావేశమయ్యారు.