News April 3, 2025
కాజీపేట: టాస్క్ ఫోర్స్కు చిక్కిన జూదరులు

కాజీపేటలోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.27,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు కాజీపేట్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.
Similar News
News July 7, 2025
ఉమ్మడి నల్గొండలో డీసీసీ పదవులకు తీవ్ర పోటీ.!

ఉమ్మడి NLG జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా జిల్లాలో DCC అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో DCC కీలకం కానుండటంతో పదవుల కోసం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. నేతలు ఇప్పటికే పైరవీలు మొదలు పెట్టారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎంపికలు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
News July 7, 2025
MNCL: 45 లక్షల మొక్కలు నాటేందుకు సింగరేణి సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఅండ్ఎండీ బలరాం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో కనీసం మూడు మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 14 వేల హెక్టార్లలో ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటిందని పేర్కొన్నారు.
News July 7, 2025
VJA: త్వరలో రైతులకు యాన్యుటీ నగదు

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అందించే వార్షిక యాన్యుటీ (కౌలు) చెల్లించేందుకు విజయవాడలోని CRDA అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. జరీబు, మెట్ట భూమి ఇచ్చిన వారికి ఇచ్చే కౌలును ప్రభుత్వం మరో 5ఏళ్లు పొడిగించిన నేపథ్యంలో రైతుల ఖాతాలలో నగదు జమ చేసేందుకు అర్హుల జాబితాలు రూపొందించే ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు 10ఏళ్ల పాటు రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు అందజేసింది.