News September 20, 2025

కాజీపేట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మృతదేహం

image

దిల్లీ నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని 108 సిబ్బందికి రైల్లో ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. దీంతో హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లో 108 సిబ్బంది ఈఎంటీ చైతన్య, రైల్వే డాక్టర్లు పరిశీలించారు. అప్పటికే ఆ ప్రయాణికుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంలోని మార్చురీకి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News September 20, 2025

పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం: సీఎం

image

పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మాచర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పల్నాడుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. పల్నాడు చరిత్ర భావితరాలకు తెలియవలసిన అవసరం ఉందన్నారు. పల్నాడు ఉత్సవాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

News September 20, 2025

ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS రిక్రూట్‌మెంట్ శిబిరం

image

ఝార్ఖండ్‌లోని రాంచీలో ISIS ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్నిరోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్‌‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్దఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

News September 20, 2025

పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తాం: కలెక్టర్

image

పర్చూరు మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పొగాకు రైతులతో మాట్లాడారు. పొగాకు కొనుగోలు ప్రక్రియ మందగిస్తుందని రైతులు తమ సమస్యలను వారికి తెలియజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.